MDK: కౌడిపల్లి మండలం ఎల్లమ్మ దేవాలయ సమీపంలో రోడ్ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో హవేలీ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన కొండ నరేష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై మెదక్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో దారుణం జరిగింది. భార్య శ్రావణిని భర్త శ్రీశైలం దారుణంగా హత్య చేశారు. భార్య శ్రావణిపై అనుమానంతో కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సోమశిల వెళదామని చెప్పి భార్యను తీసుకెళ్లిన శ్రీశైలం.. మార్గం మధ్యలో ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TG: నిజామాబాద్లో దారుణం జరిగింది. మాక్లూర్ మండలం ధర్మోరాలో గ్రామస్తులు ఇద్దరు యువకులను కొట్టి చంపారు. వివాహేతర సంబంధం నెపంతో యువకులను హత్య చేశారు. మరణించిన వారిని ప్రసాద్, రమేశ్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
NZB : జిల్లాలో దారుణం జరిగింది. మాక్లూర్ మండలం ధర్మోరలో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. గౌతమ్నగర్కి చెందిన జిలకర ప్రసాద్, తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి ధర్మోరకి వెళ్లాడు. అక్కడ వారి కళ్లల్లో కారం కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
TG: HYDలోని అత్తాపూర్లో వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాక్టర్కు విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన యువకులు వెంటనే ట్రాక్టర్ పైనుంచి దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ట్రాక్టర్, విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నాయి. పండుగ వేళ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కృష్ణా: గుడివాడలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించాల్సిన అవసరంపై ఎస్సై నాగరాజు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణ రక్షకంగా ఉంటుందని, హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగిన అనేక ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్ ధరించాలని సూచించారు.
HYD: అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసి పరివాహక ప్రాంతంలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సదరు వ్యక్తి మైనార్టీ వర్గానికి చెందినవారని పోలీసులు ధృవీకరించారు. అతని వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే అంబర్పేట్ పోలీస్ స్టేషన్ SHO కిరణ్ కుమార్ 87126 60590ను సంప్రదించాలని సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AKP: నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు ఆధ్వర్యంలో ఆదివారం భీ.బలిఘట్టం, ఉత్తరవాహిని, లింగాపురం ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల ద్వారా శాంతి భద్రతలను కాపాడటం, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేసేందుకు ఉపయోగపడుతుందని సీఐ తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు.
MNCL: బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాలలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కన్నాలకి చెందిన పుల్లగొర్ల పుష్పలత అనే మహిళను అరెస్ట్ చేసినట్లు రూరల్ CI హనోక్ ఆదివారం తెలిపారు. ఈనెల 22న ఇందూరి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడి బంగారం, రూ.15 వేలు దొంగతనం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితురాలిని కోర్ట్లో హజరుపరిచి రిమాండ్కు తరలించమన్నారు.
VSP: విశాఖ రైల్వే స్టేషన్లో ఆదివారం రైల్వే పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 50 వేల విలువైన 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మైసూర్ జిల్లా, కర్ణాటకకు చెందిన రసూల్, సాధిక్ హుసేన్లు బెంగళూరుకు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
KMR: కుటుంబ కలహాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు భరించలేక మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్న మల్లారెడ్డి శివారులో చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. కొటాల్ పల్లికి చెందిన మణెమ్మ(49) ఆదివారం ఇంట్లో భర్తతో గొడవపడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు శవాన్ని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KNR: రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందిన ఘటన సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో చోటుచేసుకుంది. వ్యవసాయ బావి వద్ద ఆడుకుంటున్న చీరాల కౌశిక్ నంద(2) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. బాలుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: పామిడి మండలం పొగరుర్ గ్రామ సమీపంలోని 44 హైవే బ్రిడ్జిపై ఆదివారం లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన కారు డ్రైవర్ భరత్ కుమార్కు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న 1033 హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
VSP: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఆదివారం CI కే.వీ. సతీష్ కుమార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని సమాజంలో మంచి పౌరులుగా మారాలని సూచించారు. మంచిగా మెలిగినవారి షీట్లు తొలగించేందుకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. మార్పు లేకపోతే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. వినాయక చవితి సందర్భంగా గొడవలకు దూరంగా ఉండాలని తెలిపారు.
E.G: కోరుకొండ మండలం కాపవరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. స్థానికుల సమాచారంతో సీఐ సత్యకిషోర్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. వైజాగ్ నుంచి ఆన్లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ నడిపిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. రూ. 8.40 లక్షల నగదు, బైక్, టీవీ, 7 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.