• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

బంకు దగ్ధం.. రూ.50 వేలు నష్టం

KRNL: హొళగుంది (మం) ఎల్లార్తి గ్రామంలో బోయ కామాక్షమ్మ అనే మహిళకు చెందిన బీడీ బంకు విద్యుత్ షార్ట్ సర్క్యూ ట్తో కాలిపోయింది. ప్రమాదంలో దాదాపు రూ.50 వేలు విలువజేసే సరకులు కాలిపోయినట్లు బాధితులు వాపోయారు. బంకులో ఉన్నట్టుండి మంటలు వ్యాపించడంతో స్థానికులు మంటలు ఆర్పే లోపు అప్పటికే చాలా వరకు సరకులు కాలిపోయాయని తెలిపారు.

February 24, 2025 / 11:10 AM IST

రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి

TPT: నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ (42) పుదూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ బాబి వివరాలు మేరకు.. భాస్కర్ విధులు నిర్వహించుకొని తన సొంతూరు ఈశ్వరవాక వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

February 23, 2025 / 07:52 PM IST

సొంత చెల్లినే గర్భవతి చేసిన అన్న

ప్రకాశం: మానవ సంబంధాలను మంట గలిపే దారుణ ఘటన కొండపి మండలంలో వెలుగు చూసింది. విజయవాడలోని తల్లి వద్ద ఉంటున్న పెద్ద చెల్లిని, సొంత అన్న గతేడాది క్రిస్మస్‌కు పెట్లూరుకు తీసుకొచ్చాడు. పండగ అనంతరం చెల్లిని విజయవాడలో వదిలిపెట్టకుండా తన వెంట హైదరాబాద్ తీసుకువెళ్లాడు. కొన్నాళ్లకు అనారోగ్యంతో తల్లి వద్దకు చేరుకున్న కుమార్తెకు వైద్య పరీక్షలు చేయగా గర్భవతి అని తేలింది.

February 23, 2025 / 06:40 AM IST

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ యువకులకు గాయాలు

GNTR: ఫిరంగిపురంలో శనివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాల ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఫిరంగిపురం గ్రామానికి చెందిన సాయి, కుమార్ యువకుల ద్విచక్ర వాహనాలు మార్నింగ్ స్టార్ కళాశాల సమీపంలో ఢీకొట్టుకోవడంతో ఇద్దరి యువకులకు గాయాలయ్యాయి. గాయాలైన యువకులను ఆసుపత్రికి తరలించారు.

February 23, 2025 / 05:38 AM IST

బెంగళూరు-చెన్నె హైవేపై ప్రమాదం

CTR: బంగారుపాలెం మండలం తిమ్మాజీపల్లి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై బంగారుపాలెం నుంచి బెంగళూరు వెళ్తున్న కారు, ఓ బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకు మీద ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

February 22, 2025 / 08:09 PM IST

విద్యార్ధిని ఆత్మహత్య .. కేసు నమోదు

మేడ్చల్: ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిలుకానగర్‌లోని డాక్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధిని బట్టు సంజన(15) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు విద్యార్థిని తల్లీ నీలా పోలీసుల ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2025 / 07:24 PM IST

BREAKING: శ్రీశైలం టన్నెల్‌లో ప్రమాదం

TG: శ్రీశైలం ఎడమ కాలువకు సంబంధించిన టన్నెల్‌లో ప్రమాదం జరిగింది. టన్నెల్ 14వ కి.మీ దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడగా.. మరికొందరు టన్నెల్‌లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అధికారులు ఘటనాస్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2025 / 11:14 AM IST

అదుపుతప్పి బోల్తా పడిన కారు.. ముగ్గురికి గాయాలు

కడప: పోరుమామిళ్లకు చెందిన వారికి శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బేస్తవారిపేట మండలం కలగట్లలో శనివారం కర్నూలు – ఒంగోలు హైవేపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బేస్తవారిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

February 22, 2025 / 11:13 AM IST

నరసాపురం పోస్టల్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అరెస్ట్

KDP: పోస్టల్ ఖాతాదారుల దగ్గర ఆర్డీ డబ్బులు తీసుకొని మోసం చేసిన నరసాపురం పోస్టుమాస్టర్ తిరుపాల్ నాయక్‌ను శుక్రవారం అరెస్టు చేశామని ఎస్సై హనుమంతు తెలిపారు. తిరుపాల్ నాయక్ నర్సాపురం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా పనిచేస్తూ 55 మంది పోస్టల్ ఖాతాదారుల వద్ద రూ. 22,67,469 నమ్మించి మోసం చేశాడని అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

February 21, 2025 / 07:59 PM IST

పెట్రోల్ బంక్ లోకి దూసుకెళ్లిన బస్సు

NLR: కోవూరు మండలం రామన్నపాలెం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. వైజాగ్ నుంచి బెంగళూరుకు 27 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు రహదారి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లింది. ట్రావెల్ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 21, 2025 / 04:32 AM IST

సత్యవేడు వద్ద 8 కిలోల గంజాయి సీజ్

TPT: సత్యవేడు-తమిళనాడు సరిహద్దులోని మాదరపాకం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానాస్పదంగా వెళ్తున్న బాలమురుగన్ అనే వ్యక్తిని తనిఖీ చేశారు. ఆయన వైజాగ్ నుంచి చెన్నైకి 8 కిలోల గంజాయిని తరలిస్తున్నాడన్న విషయం తెలుసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

February 20, 2025 / 07:47 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. సింగరేణి కార్మికుడు మృతి

PDPL: సింగరేణి సంస్థ ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కార్మికుడు ఊరగొండ రాజకుమార్ గురువారం ఉదయం కలవచర్ల గ్రామంలోని భోక్కల వాగు బ్రిడ్జిలో పడి మరణించాడు. పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారిలో ఈ దుర్ఘటన జరిగినది. మంథని సీఐ రాజు, ఎస్సై దివ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

February 20, 2025 / 11:22 AM IST

అధికారులు తిట్టారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

MNCL: అటవీ అధికారులు తిట్టారని జన్నారం మండలంలోని గడంగూడాకు చెందిన తుకారాం ఆత్మహత్యాయత్నం చేశాడని స్థానికులు తెలిపారు. గడంగూడాలో స్థానికులు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. గురువారం అటవీ అధికారులు వచ్చి వెళ్లిపోవాలని దుర్భాషలాడారన్నారు. తుకారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో జన్నారం అటవీ కార్యాలయం ముందు ఆందోళన చేసి ఆస్పత్రికి తరలించారు.

February 20, 2025 / 10:34 AM IST

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ముంజాల స్వామి (48) రోజు వారీగా గీత కార్మిక వృత్తిలో భాగంగా బుధవారం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారి పడి మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

February 20, 2025 / 07:55 AM IST

ఉరివేసుకుని 8వ తరగతి బాలిక ఆత్మహత్య

SKLM: మందస మండలం లోహరిబంధ గ్రామంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మధ్యాహ్న భోజనం అనంతరం సమీపంలో ఉన్న జీడీ తోటలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 19, 2025 / 06:26 PM IST