జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లను కలిపే జోజిలా కనుమ వద్ద భారీగా హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. హిమపాతం కారణంగా శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పలువురు వాహనదారులు ఇక్కడ చిక్కుకుపోయారు. అధికారులు ఈ మార్గాన్ని క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.