AP: గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్స్టేషన్లో వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి.. కలెక్టరేట్ ఎదుట దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎలాంటి అనుమతి లేకుండా దీక్ష చేశారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.