WG: ఆకివీడు పెదపేట రామాలయ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని కోరుతూ దళిత, ప్రజా సంఘాల నేతలు సోమవారం కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిశారు. మాజీ MLA దిగుపాటి రాజగోపాల్ నేతృత్వంలో KVPS, CITU, బహుజన జేఏసీ ప్రతినిధులు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కె.క్రాంతిబాబు, బి.వాసుదేవరావు, డి.వి.సాగర్, జుత్తిగ నరసింహా మూర్తి పాల్గొన్నారు.