SS: బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈగల్ ఎస్సై శ్రీహరి మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఎస్సై నారాయణ రెడ్డి విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని కోరారు.