TPT: వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ హత్యను నిరసిస్తూ తిరుపతిలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు కూన అజయ్ బాబు మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.