సత్యసాయి: డీఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో 227 మంది గ్రామ సంఘ సహాయకులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. మడకశిర, అగళి, గుడిబండ, అమరాపురం, రోళ్ల మండలాలకు చెందిన సిబ్బందికి వీటిని అందజేశారు. పరిపాలనలో డిజిటల్ సాంకేతికతను భాగం చేస్తూ మహిళా సాధికారతను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.