PPM: రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన్యం జిల్లా అసిస్టెంట్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష ఆధ్వర్యంలో సోమవారం అంతరాష్ట్ర దాడులు నిర్వహించారు. దాడుల్లో 8400 లీటర్ల బెల్లపు ఊట,100 లీటర్ల నాటుసారా, 540 కిలోల నల్ల బెల్లం ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆనంతరం నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.