AP: మార్కాపురం శివారులో బస్సు దగ్ధం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో యజమాని హరికృష్ణా రెడ్డి బస్సు నడిపాడు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి 14 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకుడైన హరికృష్ణపై కేసు నమోదు చేశారు. కాగా, ప్రమాదం జరగగానే నిందితుడు బస్సు నుంచి దూకి పారిపోయాడు. తాజాగా కనిగిరి వద్ద పోలీసులు అతడిని అదుపుతోకి తీసుకున్నారు.