ASR: జీవో నెంబర్ 60 రద్దు చేయాలని కొయ్యూరు మండలంలోని అన్ని పంచాయతీల అభివృద్ధి అధికారులు కోరారు. మంగళవారం పంచాయతీ అభివృద్ధి అధికారుల సమాఖ్య మండల యూనియన్ తరపున ఎంపీడీవో ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. జీవో నెంబర్-60 వల్ల రాష్ట్రంలో సుమారు 6,166 మంది పీడీవోలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జీతం స్కేల్ రూ.28,280 నుంచి రూ.25,220 కి మార్పు చేయడం తగదన్నారు.