TG: రాష్ట్రంలో 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, CCLA కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన తహసీల్దార్లు ఎలాంటి ఆలస్యం చేయకుండా, వెంటనే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాలలో విధుల్లో చేరి ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు.