SS: సోమందేపల్లి మండలం రంగేపల్లిలో పెనుకొండ డీఎస్పీ నరసింగప్ప సమక్షంలో మంగళవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామస్థులకు సమాజానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రొజెక్టర్ ద్వారా సమాచార వీడియోలను ప్రదర్శించారు. ప్రజల్లో చట్టాలు, భద్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం అని ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు.