కోనసీమ: క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు, మానసికొల్లాసానికి దోహదపడతాయని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి శ్రీ రామా రెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన క్రికెట్ ప్రాక్టీస్ నెట్ కోర్టులను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులు రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.