AKP: అనకాపల్లికి మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణానికి ఎంపీ సీఎం రమేష్ బుధవారం స్థల పరిశీలన చేశారు. అచ్చయ్యపేట వద్ద పరిశీలించిన స్థలం అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. అక్కడి నుంచి అధికారులతో మాట్లాడి భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం అక్కడ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.