E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 16, 17వ స్నాతకోత్సవాలకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరవుతారు. వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. వేడుకల ఏర్పాట్లు, వివరాలు వివరించగా, గవర్నర్ రాకతో వర్సిటీ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.