TG: నల్గొండ జిల్లా తిప్పర్తి వద్ద పల్నాడు-సింహాద్రి ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. పట్టాలపై ఉన్న గేదెను రైలు బలంగా ఢీకొనడంతో, ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రైలు అక్కడే నిలిచిపోయింది. సిబ్బంది ప్రస్తుతం మరమ్మతులు చేపట్టారు. ఈ ప్రమాదంతో నల్గొండ – మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.