కోనసీమ: యానాం అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సిబ్బంది ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు అధికారిక పోలింగ్ ప్రారంభం కానుంది. బూత్ ఏజెంట్లు ఉదయం 5 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.