ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయం చుట్టుపక్కల ప్రాంతం రోజురోజుకు మురికితో నిండిపోతూ, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తోంది. ప్రహరీ గోడ పక్కన చెత్త పారవేయడం వల్ల దుర్గంధం వ్యాపించి పాఠకులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చెత్త తొలగించి, భవిష్యత్తులో చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.