BPT: అద్దంకి మండలంలోని కొణిదేన గ్రామంలో రీసర్వే కార్యక్రమానికి సంబంధించిన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రీసర్వే విధానం, చేపట్టే చర్యలపై అధికారులు వివరించారు. గ్రామంలో భూ రికార్డుల పునఃసర్వే ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. భూముల సరిహద్దులు, పట్టాదారుల వివరాలు ఖచ్చితంగా నమోదు చేసే దిశగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.