AKP: నర్సీపట్నం వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయంలో నూతన సాంకేతికతపై శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. నూతన పద్ధతిలో నారు పెంపకం గురించి తెలియజేశారు. నారు పెంపకం 10 సెంట్లు చేసి 30 నుంచి 40 వేలు సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి శ్రీదేవి పాల్గొన్నారు.