ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1Bలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టెర్మినల్ లోపలి కేబుల్ ట్రేలు, స్విచ్ బాక్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు ధృవీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.