TG: ఇంటర్ ఫలితాలను తొలుత ఏప్రిల్ 10 లేదా 12 తేదీలలో ప్రకటించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫలితాల ప్రక్రియను మరింత కచ్చితంగా నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశాలతో అధికారులు ‘డబుల్ చెక్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. మార్కుల లెక్కింపులో ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.