AKP: జీడిమామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వై. పాపారావు డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పూత దశలో పొగమంచు ప్రభావం, ప్రస్తుతం వర్షాలతో నష్టాలు పెరిగాయని, ప్రభుత్వం తక్షణం పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.