E.G: ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ పనులను కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ.. భూముల రీ-సర్వే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు. ప్రతి రైతుకు సరైన సమాచారం అందించి వారి సమక్షంలోనే కొలతలు చేపట్టాలన్నారు.