సత్యసాయి: జిల్లాలో ఈ నెల 9 నుంచి 23 వరకు 8వ పోషణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో తల్లి, బిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార విలువలు, చిన్నారుల మానసిక వికాసం, జంక్ ఫుడ్ అనర్థాలపై చర్చిస్తారని పేర్కొన్నారు.