KKD: రౌతులపూడి SI వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గుమ్మరేగులలో బుధవారం రాత్రి “పల్లెనిద్ర” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, గృహహింస వంటి అంశాలపై SI అవగాహన కల్పించారు. మహిళలు సెల్ఫ్ డెస్క్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే తక్షణమే పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.