WNP: పానగల్ మండలం కొత్తకోట ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ రాధా కిరణ్ సాగర్ మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని నిర్వాహకులకు శుక్రవారం సూచించారు. అనంతరం కిచెన్ షెడ్డు, మూత్రశాలల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ప్రధానోపాధ్యాయుడు కురుమూర్తి పాల్గొన్నారు.