అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. శాంతి నెలకొనడమే ముఖ్యం తప్ప, మధ్యవర్తిత్వం ఎవరన్నది భారత్కు ముఖ్యం కాదన్నారు. అయితే, పాక్ ప్రధాని ట్వీట్లో వాడిన భాష అమెరికాదేనని, పాక్ కేవలం ఒక ముసుగులా పనిచేస్తోందని వ్యంగ్యంగా అన్నారు. ఇరాన్ సంక్షోభం ముదిరితే పాక్కే శరణార్థుల ముప్పు ఉంటుందన్నారు.