ప్రకాశం: 2010కి ముందు నియమితులైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని APTF రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల డిమాండ్ చేశారు. ఆదివారం మార్కాపురంలోని తమ కార్యాలయంలో మాట్లాడుతూ.. KGBV ఉపాధ్యాయులకు MTS వర్తింపజేయాలని, కరోనా సమయంలో మరణించిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.