ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని హిజ్రాలకు అర్బన్ సీఐ సురేష్, రూరల్ సీఐ రామకోటయ్య శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో గౌరవంగా జీవించాలని సూచించారు. పట్టణంలో తిరుగుతూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని హెచ్చరించారు.