KRNL: కోడుమూరు కొండపేటలో మహిళల భద్రతపై ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. ‘మీ రక్షణ- మా బాధ్యత’ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మహిళలు భయపడకుండా సమస్యలను పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ ఉపేంద్రబాబు సూచించారు. సైబర్ నేరాలు, వేధింపులపై జాగ్రత్తలు తీసుకుని, శక్తి యాప్ వినియోగించాలని తెలిపారు.