NTR: జిల్లా పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన 14 మంది పోలీసు అధికారులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులను శాలువాలతో సత్కరించారు. సుదీర్ఘకాలం ప్రజాసేవ చేసిన వారి సేవలను డీసీపీ కొనియాడారు.