ATP: అనంతపురం నగరంలో ఉరుముల,మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సందర్శకులు వసతి కేంద్రం ఈదురు గాలులకు కుప్ప కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వసతి కేంద్రం కింద ఉన్న ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.