కోనసీమ: మండపేట మండలంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరామర్శించారు. ద్వారపూడి గ్రామంలో మాజీ జెడ్పిటీసీ తులా రంగారావు, అనమాల రాము, ఆకుమర్తి సుబ్బారావు, అర్తమూరు గ్రామంలో మండా వెంకటరెడ్డి, సబ్బెళ్ళ రామారెడ్డి, ఏలేటి గణపతి, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.