శరీరంలోని శక్తి మాటల రూపంలో వృథా కాకుండా కాపాడుకోవడమే మౌన వ్రతం ముఖ్య ఉద్దేశం. మౌనం అంటే మాట్లాడకపోవడమే కాదు మనసులోని ఆలోచనలను నిశ్శబ్దం చేయడం. ఇది ఒత్తిడిని, కోపాన్ని తగ్గించి రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే మెదడుకు విశ్రాంతినిస్తూ మనోబలాన్ని, ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతగానో దోహదపడుతుంది.