తూ.గో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో శనివారం రాజమండ్రిలోని జిల్లా ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తం 125 మంది అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరుకాగా 49 మంది ఎంపిక అయ్యారని వివరించారు.