NTR: కంచికచర్ల మండలం బత్తినపాడు గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించబడిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం సందర్శించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆమె స్వామివారిని ప్రార్థించారు.