కర్నూలు: ఐపీఎల్ బెట్టింగ్, మట్కా, జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు చేపట్టాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జిల్లా ఎస్పీ జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణపై ముఖ్య సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో జూద కార్యకలాపాలు కట్టడి చేయాలన్నారు.