PLD: సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు. వేసవిలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.