CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని మాజీ ఐఏఎస్ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం ఏకసభ్య కమిటీ సభ్యుడు దినేశ్ కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ అందించారు.