తూర్పు గోదావరి జిల్లాలో సెన్సస్-2027 నిర్వహణకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఆదేశించారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు జరిగే స్వీయ నమోదులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రోజుకు కనీసం 10 నుంచి 20 మంది స్వీయ నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు స్పష్టం చేశారు.