ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి పామూరు, నెల్లూరు మీదుగా తిరుపతికి ప్రతిరోజు సాయంత్రం 06.00 గంటలకు ఎక్స్ప్రెస్ సర్వీసును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షయానా బేగం తెలిపారు. ఈ బస్సు సాయంత్రం 6 కనిగిరిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 1 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి తిరుపతిలో ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు కనిగిరికి చేరుకుంటుందన్నారు.