NDL: ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సోమవారం గోస్పాడులోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో గోశాలను ప్రారంభించారు. విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ పీ.దస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చాగంటి దంపతులు శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో పాఠశాలను ఏర్పాటు చేయడం అద్భుతమని ఆయన కొనియాడారు.