సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో తమిళ నూతన సంవత్సర వేడుకలు జేబీ కీర్తన భరద్వాజ్ బృందం కర్ణాటక సంగీత కచేరీతో ఘనంగా ముగిశాయి. ఆల్ ఇండియా రేడియో ఏ-గ్రేడ్ కళాకారిణి అయిన కీర్తన సంప్రదాయ దేవారం స్తోత్రాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘బ్రోచేవారెవరు’, ‘మోక్షము గలదా’ వంటి కీర్తనలను ఆమె శ్రావ్యంగా ఆలపించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు.