GNTR: తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చెప్పులు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ రామ అప్పలనాయుడు, ఎంహెచ్వో ఏసుబాబు పాల్గొని కార్మికులకు చెప్పులను అందజేశారు. కార్మికుల ఆరోగ్య రక్షణలో భాగంగా ప్రతి ఏడాది ఇచ్చే విధంగా ఈ సారి కూడా చెప్పులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.