WG: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం భీమవరంలోని ఓ పెట్రోల్ బంకును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఇంధన లభ్యతను పరిశీలించారు. కృత్రిమ కొరత సృష్టించవద్దని, అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. త్వరితగతిన సరఫరా చేయాలని యజమానులను ఆదేశించారు.