NDL: డోన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి అక్రమంగా విక్రయించారని ఇవాళ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి, ఆమెను సర్వీస్ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల సోమనాథ్ వద్ద 379 మద్యం సీసాలు పట్టుబడగా, వాటిని సీఐ అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు.