ATP: జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలోని 2,75,973 మంది లబ్ధిదారుల కోసం రూ. 124.01 కోట్ల నిధులను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. మే 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్ మొత్తం అందజేయనున్నారు.