CTR: పూతలపట్టు మండలం చవటపల్లి హరిజనవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దాదాపు 70 ఏళ్లుగా విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేశారు. విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించారు.