BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హిందీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించిన వివిధ స్థాయిల పరీక్షల్లో మొత్తం 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు.